సాక్షిపై ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్కు టీడీపీ ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-02-19T20:15:01+05:30 IST
సాక్షిపై ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఐటీ దాడుల వార్తలను వక్రీకరించారంటూ
అమరావతి: సాక్షిపై ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఐటీ దాడుల వార్తలను వక్రీకరించారంటూ ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. సంబంధంలేని విషయాలను చంద్రబాబుకు ఆపాదించడం.. నైతిక విలువలు, జర్నలిజం ప్రమాణాలను దిగజారుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నిరాధారమైన వార్తల క్లిప్పింగ్లు, వీడియో సీడీలను ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్కు టీడీపీ పంపింది.