ఇకపై విస్తృతంగా పోరాటాలు: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-01-01T22:22:39+05:30 IST
రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఇకపై మరింత
అమరావతి: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఇకపై మరింత విస్తృతంగా పోరాటాలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మీడియాతో చంద్రబాబు చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. పంటల పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆయన ఆరోపించారు. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి కంటే జగన్ ఏదో చేస్తారని ప్రజలు భావించారన్నారు. కానీ ఇప్పుడు ఆ భ్రమలు తొలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇకపై మరింత విస్తృతంగా పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు.