TDP కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెడతారా: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-05-20T22:26:29+05:30 IST
టీడీపీ (TDP) కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెడతారా అని ఈ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు.
అనంతపురం: టీడీపీ (TDP) కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెడతారా అని ఈ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీని అన్ని విధాలా భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. ఎక్కడ చూసినా విధ్వంసమే.. అన్ని ప్రాజెక్టులు పోయాయని తెలిపారు. 'క్విట్ జగన్ - సేవ్ ఆంధ్రప్రదేశ్' నినాదాలతో ప్రజాఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. సమైక్యంగా ముందుకుపోయి ఏపీని కాపాడుకోవాలన్నారు. లేకుంటే శ్రీలంకలా ఏపీ మారే ప్రమాదం ఉందని చంద్రబాబు హెచ్చరించారు.