ఇతర అవసరాలకు మళ్లించి ప్రజలను మోసం‌ చేశారు: గద్దె రామ్మోహన్

ABN , First Publish Date - 2020-09-30T18:02:11+05:30 IST

ఇతర అవసరాలకు మళ్లించి ప్రజలను మోసం‌ చేశారు: గద్దె రామ్మోహన్

ఇతర అవసరాలకు మళ్లించి ప్రజలను మోసం‌ చేశారు: గద్దె రామ్మోహన్

విజయవాడ: వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని టీడీపీ నేత గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. టీడీపీ హయంలో అన్ని వర్గాల వారు ఈ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి పొందారని చెప్పారు. జగన్ కార్పొరేషన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి ప్రజలను మోసం‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలుగా ఎస్సీ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఆనంద్ సూర్య నిరసన దీక్షతో అయినా ప్రభుత్వం కార్పొరేషన్లను పటిష్ఠం చేయాలన్నారు. 

Updated Date - 2020-09-30T18:02:11+05:30 IST