ఓటీటీలోకి తుగ్లక్ దర్బార్
ABN , First Publish Date - 2021-04-25T05:30:00+05:30 IST
కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. విజయ్ సేతుపతి, రాశీఖన్నా జంటగా నటించిన తమిళ చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది...
కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. విజయ్ సేతుపతి, రాశీఖన్నా జంటగా నటించిన తమిళ చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. పార్థీబన్, మంజిమా మోహన్ ఇతర పాత్రల్లో నటించారు. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోవింద వసంత సంగీతం అందించారు. త్వరలోనే ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ చిత్రం విడుదల కానుంది. విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది.