తాలిబన్ల దారుణాలు.. అతడు కన్నీరుకారుస్తున్నా పట్టించుకోకుండా.. నడివీధిలో..

ABN , First Publish Date - 2022-01-17T02:39:48+05:30 IST

షరియా చట్టం అమలు పేరిట తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్‌లో కలకలం రేపుతున్నారు. తాజాగా వారు ఓ సంగీత వాయిద్యాన్ని నడివీధిలో తగల బెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాలిబన్ల దారుణాలు.. అతడు కన్నీరుకారుస్తున్నా పట్టించుకోకుండా.. నడివీధిలో..

ఇంటర్నెట్ డెస్క్: షరియా చట్టం అమలు పేరిట తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్‌లో కలకలం రేపుతున్నారు. తాజాగా వారు ఓ సంగీత వాయిద్యాన్ని నడివీధిలో తగల బెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్తియా ప్రావిన్స్‌లో ఓ వ్యక్తికి చెందిన వాయిద్యానికి నాలుగు రోడ్ల కూడలిలో నిప్పుపెట్టారు. బాధితుడు కన్నీరు పెట్టుకుంటున్నా కూడా కనికరం చూపక దాష్టికానికి తెగబడ్డారు. మరో తాలిబన్..బాధితుడివైపు గన్ను చూపిస్తూ వెటకారంగా నవ్వుతున్న దృశ్యం కూడా ఈ వీడియోలో రికార్డైంది. ఆఫ్ఘానీ జర్నలిస్టు ట్విటర్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 




Updated Date - 2022-01-17T02:39:48+05:30 IST