వందల ఏళ్లుగా బోనాల జాతర నిర్వహిస్తాం: తలసాని
ABN , First Publish Date - 2022-06-30T19:25:25+05:30 IST
బోనాలు అత్యంత సంతోషకరమైన సమయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) పేర్కొన్నారు.
Hyderabad : బోనాలు అత్యంత సంతోషకరమైన సమయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) పేర్కొన్నారు. బోనాల్లో మొదటి బోనం జగదాంబికా అమ్మవారికి సమర్పించిన అనంతరం ప్రారంభిస్తున్నామన్నారు. వందల ఏళ్లుగా బోనాల జాతర జరుగుతోందన్నారు. నగరంలోని ప్రతి ఆలయానికి ఆర్ధిక సాయం అందించిన ఘనత తెలంగాణదేనన్నారు. ఈ కార్యక్రమం కోసం అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తలసాని పేర్కొన్నారు. 17, 18న సికింద్రాబాద్(Secunderabad)లో బోనాలు నిర్వహిస్తామన్నారు. 24, 25న లాల్ దర్వాజ బోనాలు జరుగుతాయన్నారు. బోనాలు మన సంస్కృతికి అద్దం పడతాయన్నారు. కుల మతాలకు అతీతంగా బోనాలు నిర్వహిస్తామన్నారు. 10 వ తేదీన బోనాలు, బక్రీద్ వేడుకలు జరపనున్నట్టు వెల్లడించారు. అందరం కలిసి అన్ని పండుగలు చేసుకోవాలని తలసాని సూచించారు.