సువెన్ ఫార్మా రూ.600 కోట్ల పెట్టుబడులు
ABN , First Publish Date - 2020-10-31T06:54:24+05:30 IST
సామర్థ్య విస్తరణకు సువెన్ ఫార్మాస్యూటికల్స్ రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పాశమైలారం యూనిట్ సామర్థ్యం పెంపు,
త్రైమాసిక లాభం రూ.74 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినె్స):సామర్థ్య విస్తరణకు సువెన్ ఫార్మాస్యూటికల్స్ రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పాశమైలారం యూనిట్ సామర్థ్యం పెంపు, సూర్యాపేట యూనిట్లో బ్లాకుల నవీకరణ, జీడిమెట్ల నుంచి పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి పెట్టుబడులు పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. కొత్త టెక్నాలజీలను సొంతం చేసుకోవడానికి కూడా నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించింది.
కాగా సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గాను కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ.74.07 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.93 కోట్లతో పోలిస్తే 20.35 శాతం తగ్గింది. త్రైమాసిక సమీక్షా కాలంలో ఆదాయం కూడా 14.59 శాతం తగ్గి రూ.278.37 కోట్ల నుంచి రూ.237.74 కోట్లకు పరిమితమైంది.