సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-04-10T00:18:33+05:30 IST
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సూర్యాపేట: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్దతు ధర క్వింటా రూ.1200 ట్రేడర్స్ ఇవ్వడంతో రైతులు భగ్గుమన్నారు. రైతులు కాంటా మిషన్లు ధ్వంసం చేశారు. అధికారులు వెంటనే కొనుగోళ్లు నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. మద్దతు ధర పెంచిన తర్వాతే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనతో కొనుగోళ్లు నిలిచిపోయాయి.