ఆస్ట్రేలియా నుంచి వచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా....

ABN , First Publish Date - 2022-04-27T19:20:46+05:30 IST

జిల్లాలోని చివ్వెంల మండలం తిరుమలగిరి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు.

ఆస్ట్రేలియా నుంచి వచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా....

సూర్యాపేట: జిల్లాలోని చివ్వెంల మండలం తిరుమలగిరి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన కారు కల్వర్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన దంపతులు హేమాంమ్ బరధర్, రజిత అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు, కారు డ్రైవర్‌కు తీవ్ర  తీవ్రగాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో హేమాంమ్ బరధర్ దంపతులు ఉద్యోగం చేస్తున్నారు. నిన్న ఆస్ట్రేలియా నుంచి వచ్చి రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందిన వెంటనే  పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దంపతుల మరణవార్త విని స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Updated Date - 2022-04-27T19:20:46+05:30 IST