తెలంగాణ రాజకీయాలపై పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-09T22:15:56+05:30 IST

తెలంగాణ రాజకీయాలపై జనసేన పవన్‌కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

తెలంగాణ రాజకీయాలపై పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై జనసేన పవన్‌కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమని పవన్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు తనను పిలిచే వరకు ఇక్కడకు రానని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై నుంచే జనసేన పార్టీని ప్రారంబించానని గుర్తుచేశారు. తెలంగాణ సమస్యలపై పోరాడే వారిని అసెంబ్లీకి పంపించటానికి కృషి చేస్తానని ప్రకటించారు. తెలంగాణ పోరాట స్పూర్తి జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి తన గుండెలో ధైర్యాన్ని నింపిందని తెలిపారు. 


తెలంగాణ భాషను, యాసను తాను గౌరవిస్తున్నానని తెలిపారు. అడుగుపెడితేనే అనుభవం రాదని వ్యాఖ్యానించారు. తలకాయ ఎగిరిపోతుందా.. ఓడిపోతామా.. గెలుస్తామా అని ఆలోచించలేదన్నారు. కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయని, కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. కులాల కొట్లాటతో ఏపీ అభివృద్ధి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యం, అవినీతి, పేదరికమే జనసేనకకు బద్దశత్రువులని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకులను తెలంగాణ నాయకులు బద్దశత్రువులుగా చూశారని విమర్శించారు. ఏపీలో వైసీపీ నాయకులు తనకు శత్రువులు కాదని, సమస్యలు మాత్రమే శత్రువలని పేర్కొన్నారు. ఏ మతంపై దాడి జరిగినా ఖండిస్తానని పవన్‌కల్యాణ్ ప్రకటించారు.

Updated Date - 2021-10-09T22:15:56+05:30 IST