అమరరాజాపై బలవంతపు చర్యలొద్దు

ABN , First Publish Date - 2022-05-20T07:55:29+05:30 IST

అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు..

అమరరాజాపై బలవంతపు చర్యలొద్దు

ఆంధ్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం

షోకాజ్‌ నోటీసులపై స్టే


న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన ఆ కంపెనీకి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన రెండు షోకాజ్‌ నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలపై స్టే విధించింది. షోకాజ్‌ నోటీసులపై చట్టప్రకారం ముందుకెళ్లవచ్చని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ హిమా కోహ్లితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాష్ట్రప్రభుత్వంతో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Updated Date - 2022-05-20T07:55:29+05:30 IST