అమరావతి భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ABN , First Publish Date - 2021-07-19T22:21:41+05:30 IST
అమరావతి భూముల కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు తీర్పు
ఢిల్లీ: అమరావతి భూముల కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి భూముల కొనుగోలు కేసులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగలేదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. సుప్రీంకోర్టులో అమరావతి భూముల కొనుగోలుపై వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన అనంతరం జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అమరావతి భూములపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ వాదనలు ప్రారంభించారు. భూముల బదలాయింపు చట్టం ప్రకారం కొనుగోలుదారులు... భూములను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో అమ్మకందారులకు చెప్పాలన్నారు. ఈ విషయంలో అమ్మకం దారులు మోసపోయారని.. కొనుగోలుదారులు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై భూములను కొనుగోలు చేశారని దుష్యంత్ పేర్కొన్నారు.