ధన్‌బాద్ జడ్జి హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-08-17T21:02:56+05:30 IST

ధన్‌బాద్ జడ్జి హత్య కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ధన్‌బాద్ జడ్జి హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ధన్‌బాద్ జడ్జి హత్య కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయని రాష్ట్రాలపై లక్ష జరిమానా వేస్తామని చీఫ్ సెక్రటరీలు కోర్టుకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించవచ్చని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.


దేశవ్యాప్తంగా జడ్జిలు, న్యాయవాదులకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఎటువంటి రక్షణ తీసుకుంటున్నారో దానికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు అఫిడవిట్‌లు దాఖలు చేశాయి. ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఆ రాష్ట్రాలపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ అఫిడవిట్‌ల దాఖలుకు వారం రోజుల సమయం ఇస్తున్నామని, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీజేఐ ఆదేశించారు. 

Updated Date - 2021-08-17T21:02:56+05:30 IST