కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న

ABN , First Publish Date - 2021-10-26T08:32:22+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా సుంకర శివప్రసన్న కొలువుదీరారు.

కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న

హైకోర్టు తీర్పు రాకుండానే ముగిసిన తంతు

కాకినాడ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా సుంకర శివప్రసన్న కొలువుదీరారు. డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌, ప్రిసైడింగ్‌ అధికారి లక్ష్మీశ సమక్షంలో సోమవారం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకు పలువురు టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ కండువాతో హాజరయ్యారు. కొత్త మేయర్‌ ఎన్నికకు సోమవారం ముహూర్తం ఖరారు చేసిన అధికారులు తీర్పు పెండింగ్‌లో ఉండగానే ఆ తంతు ముగించారు. 

Updated Date - 2021-10-26T08:32:22+05:30 IST