ఆదివారం పెళ్లి.. 24 గంటలకే వరుడు.. నేడు వధువు మృతి
ABN , First Publish Date - 2021-11-25T19:26:36+05:30 IST
రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు వధువు సైతం చికిత్స పొందుతూ మృతి చెందడం పెళ్లింట మరింత విషాదాన్ని నింపింది.
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో శేరిలింగంపల్లికి చెందిన కొత్త పెళ్లికొడుకు మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు వధువు సైతం చికిత్స పొందుతూ మృతి చెందడం పెళ్లింట మరింత విషాదాన్ని నింపింది. శేరిలింగంపల్లి నేతాజీనగర్లో నివాసముంటున్న అన్నపూర్ణ, మురళీకృష్ణ దంపతుల కుమారుడు శ్రీనివాసులు (36) సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూర్లో ఉద్యోగం చేస్తున్నాడు. చెన్నైకి చెందిన దేవకి, సుబ్రమణ్యం కుమార్తె కనిమొళితో తిరుపతిలోని కొలాయిగుంటలో ఆదివారం 21న వివాహం జరిగింది. చెన్నైలో ఉండే అత్తమామల ఇంటికి శ్రీనివాసులు స్వయంగా కారు నడుపుతూ సోమవారం వెళ్తుండగా తమిళనాడులోని కృష్ణగిరి ఆస్పత్రి ఎదుట ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందగా, కనిమెళి సృహ కోల్పోగా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె కోమాలోకి వెళ్లింది. నేడు కనిమొళి సైతం చికిత్స పొందుతూ మృతి చెందింది.