చార్మినార్ వద్ద 17న సండే ఫన్ డే
ABN , First Publish Date - 2021-10-16T21:29:33+05:30 IST
టాంక్బండ్ ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నమాదిరిగానే పాతబస్తీ చార్మిన్ వద్ద కూడా ఈనెల 17వ తేదీ ఆదివారం నుంచి వారం వారం ‘ ఏక్ షామ్ చార్మినార్ కేనామ్ ’ పేరు ఫన్డే నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.
హైదరాబాద్: టాంక్బండ్ ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నమాదిరిగానే పాతబస్తీ చార్మిన్ వద్ద కూడా ఈనెల 17వ తేదీ ఆదివారం నుంచి వారం వారం ‘ ఏక్ షామ్ చార్మినార్ కేనామ్ ’ పేరు ఫన్డే నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. టాంక్ బండ్ పై అలరించినట్టుగానే చార్మినార్ వద్ద కూడా సాయం సమయంలో వచ్చే సందర్శకులను అలరించనుందని, ఈమేరకు ఏర్పాట్లుచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి అర్ధరాత్రి వరకూ సండే ఫన్ డే కార్యక్రమం కొనసాగుతుంది.
ఈసమయంలో చార్మినార్ పరిసరాల్లోకి వాహనాలను అనుమతించరు. ఆదివారం సాయంత్రం 6.30గంటలకు పోలీస్ బ్యాంక్ నిర్వహించనున్నారు. రాత్రి 8గంటలకు దక్కనీ మజాహియా ముషారియా ప్రోగ్రామ్ను ఏర్పాటుచేస్తున్నారు. అలాగే అర్ధరాత్రి వరకూ లాడ్బజార్ను తెరిచి ఉంచనున్నారు. పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే కార్యక్రమాలు, వివిధ రకాల ఫుడ్స్టాల్స్ కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఇక్కడికి వచ్చే సందర్శకులకు పార్కింగ్ సదుపాయం కూడా అధికారులు కల్పించారు.