నేరుగా మెయిన్ డ్రాకు సుమిత్
ABN , First Publish Date - 2020-08-06T09:23:28+05:30 IST
భారత టెన్నిస్ యువ కెరటం సుమిత్ నాగల్కు యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాలో ఆడేందుకు అవకాశం దక్కింది. కొవిడ్-19 కారణంగా...
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ యువ కెరటం సుమిత్ నాగల్కు యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాలో ఆడేందుకు అవకాశం దక్కింది. కొవిడ్-19 కారణంగా చాలామంది స్టార్ ఆటగాళ్లు ఈ గ్రాండ్స్లామ్కు దూరం కావడంతో సుమిత్కు డైరెక్ట్ ఎంట్రీ లభించింది. యూఎస్ ఓపెన్లో సుమిత్ ఆడుతుండడం ఇది రెండోసారి. గతేడాది టోర్నీలో క్వాలిఫయింగ్ రౌండ్ల ద్వారా మెయిన్ డ్రాలో అడుగుపెట్టిన సుమిత్.. ఆరంభరౌండ్లో స్విస్ స్టార్ ఫెడరర్ చేతిలో పోరాడి ఓడాడు. కాగా.. ఈసారి టోర్నీలో భారత్ తరఫున సుమిత్ ఒక్కడే బరిలో ఉన్నాడు.