ఇద్దరు రైతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-27T00:40:48+05:30 IST
పూర్వ వరంగల్ జిల్లాలో ఇద్దరు రైతులు
వరంగల్: పూర్వ వరంగల్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకరు, జనగాం జిల్లాల్లో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కౌలు రైతు పుట్ట రవి(40) ఆత్మహత్య చేసుకున్నాడు. తాను వేసిన మిర్చి పంటకు తెగులు వచ్చింది. దీంతో పంట నష్టపోయి పెట్టుబడి కూడా రాదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జనగామ జిల్లా నర్మెట్ట మండలం ఆగపెట గ్రామానికి చెందిన యువ రైతు రాజశేఖర్ (30) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.