ఆస్తి తగాదాలతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-27T12:11:27+05:30 IST

స్థానిక బ్రాడీపేటకు చెందిన షేక్‌ కరీముల్లా కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. స్థానిక రామకృష్ణా

ఆస్తి తగాదాలతో వ్యక్తి ఆత్మహత్య

తూర్పు గోదావరి: స్థానిక బ్రాడీపేటకు చెందిన షేక్‌ కరీముల్లా కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. స్థానిక రామకృష్ణా సెంటర్‌లో కరీముల్లా ఆప్టికల్‌ షాపు నడుపుతున్నాడు. సోదరి, కుటుంబ సభ్యుల మధ్య వున్న ఆస్తి తగాదాలతో మంగళవారం రాత్రి అతడు పురుగుల మందు తాగాడు. బుధవారం ఉదయం లేవకపోవడంతో ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతిచెందినట్టు వైద్యు లు ధ్రువీకరించారు. భార్య దిల్‌షా బేగం ఇచ్చిన ఫిర్యా దుతో  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ డి.సురేష్‌బాబు తెలిపారు. 


Updated Date - 2022-01-27T12:11:27+05:30 IST