విద్యార్థులే ప్రచారకులు

ABN , First Publish Date - 2020-03-29T08:33:56+05:30 IST

‘‘విశ్వవిద్యాలయ విద్యార్థులు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనల మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ కుటుంబ...

విద్యార్థులే ప్రచారకులు

  • సామాజిక దూరంపై కుటుంబాలను చైతన్యపరచాలి
  • గవర్నర్‌ హరిచందన్‌

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ‘‘విశ్వవిద్యాలయ విద్యార్థులు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనల మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ కుటుంబ సభ్యులనూ చైతన్యపరచాలి’’ అని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. ఆయన శనివారం రాజ్‌భవన్‌లో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న తాజా పరిస్థితులను తెలుసుకున్న గవర్నర్‌... కరోనాపై విద్యార్థులరు అప్రమత్తం చేసేలా ఈ మెయిల్స్‌ ద్వారా వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్‌ చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయాల వీసీలు తక్షణమే సూచించాలని కోరారు. త్వరలోనే ఉపకులపతులతో దృశ్య, శ్రవణ విధానంలో చర్చిస్తానని గవర్నర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-03-29T08:33:56+05:30 IST