సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారుల మృతి

ABN , First Publish Date - 2022-03-16T15:19:12+05:30 IST

వనపర్తి జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులూ చెరువులో శవాలుగా తేలారు.

సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారుల మృతి

వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులూ చెరువులో శవాలుగా తేలారు. పట్టణంలోని బండార్‌నగర్‌కు చెందిన మున్నా, అజ్మద్‌, భరత్ పదో తరగతి చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం సరదాగా వనపర్తి శివారులోని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వారి కోసం మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టగా మున్నా, అజ్మత్‌ల మృతదేహాలు లభించాయి. నేటి ఉదయమే తిరిగి గాలింపు చేపట్టగా.. మరో విద్యార్థి భరత్‌ మృతదేహం బయటపడింది. ఈ ముగ్గురి మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు విద్యార్థుల మృతితో బండార్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Updated Date - 2022-03-16T15:19:12+05:30 IST