శ్రీకాకుళంలో ఇంటర్ పరీక్ష రాస్తూ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-05-18T18:30:23+05:30 IST

శ్రీకాకుళం పాతపట్నంలో పరీక్ష రాస్తూ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

శ్రీకాకుళంలో ఇంటర్ పరీక్ష రాస్తూ విద్యార్థి మృతి

శ్రీకాకుళం : శ్రీకాకుళం పాతపట్నంలో పరీక్ష రాస్తూ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జూనియర్ కాలేజ్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్థి బోరాడ కార్తీక్ స్వస్థలం సారవకోట మండలం దాసుపురం. పరీక్ష రాస్తుండగా కార్తీక్‌కు వాంతులు కావడంతో పాటు తీవ్ర తలనొప్పితో కుప్పకూలిపోయాడు. అంతా చూస్తుండగానే మరణించాడు.

Updated Date - 2022-05-18T18:30:23+05:30 IST