ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-05-29T07:55:43+05:30 IST
ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
మల్కాపురం (విశాఖపట్నం), మే 28: తోటి విద్యార్థితో ప్రేమలో పడి శారీరకంగా దగ్గరైన ఏడో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా పాఠశాలలో తనతో చదువుతోన్న బాలుడితో ఆ బాలిక (14) ప్రేమలో పడింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో గర్భం వస్తుందేమోనని ఆ బాలిక ఆందోళన చెందింది. గురువారం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చీరతో ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.