ట్రెజరీ కార్యాలయాల వద్ద ఎస్టీయూ ధర్నాలు

ABN , First Publish Date - 2022-08-11T09:12:42+05:30 IST

ట్రెజరీ కార్యాలయాల వద్ద ఎస్టీయూ ధర్నాలు

ట్రెజరీ కార్యాలయాల వద్ద ఎస్టీయూ ధర్నాలు

అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించింది. అన్ని జిల్లాల ట్రెజరీ కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద ఎస్టీయూ నాయకులు నిరసనలు చేశారు. ఇందులో పాల్గొన్న ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెందిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే సీఎ్‌ఫఎంఎస్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లాలో ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T09:12:42+05:30 IST