అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు: కన్నబాబు
ABN , First Publish Date - 2020-03-29T22:12:32+05:30 IST
అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. ఎంపెడాతో కలిసి నిర్ణయించిన ధరకే రొయ్యలు కొనాలన్నారు. ఆక్వా రంగంలో 50శాతం కూలీలను అనుమతించాలన్నారు.
అమరావతి: అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. ఎంపెడాతో కలిసి నిర్ణయించిన ధరకే రొయ్యలు కొనాలన్నారు. ఆక్వా రంగంలో 50శాతం కూలీలను అనుమతించాలన్నారు. వ్యవసాయ, అనుబంధ యూనిట్లకు అనుమతి ఇచ్చామని, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో మొబైల్ మార్కెట్లు పెంచాలని సీఎం జగన్ ఆదేశించారని కన్నబాబు తెలిపారు.