బోధన్‌లో విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి: అర్వింద్‌

ABN , First Publish Date - 2022-03-21T01:50:34+05:30 IST

బోధన్‌లో విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ఎంపీ అర్వింద్‌, కలెక్టర్‌‌కు లేఖ రాశారు. అంబేద్కర్‌ చౌరస్తాలో

బోధన్‌లో విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి: అర్వింద్‌

బోధన్‌: బోధన్‌లో విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ఎంపీ అర్వింద్‌, కలెక్టర్‌‌కు లేఖ రాశారు. అంబేద్కర్‌ చౌరస్తాలో ఈ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ స్థలంలో విగ్రహ ఏర్పాటుకు బోధన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌లో తీర్మానం చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మున్సిపల్‌ తీర్మానాన్ని కాదని అధికార, మతతత్వ పార్టీల నేతలు అడ్డుకోవడం దారుణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంటనే జోక్యం చేసుకుని విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అర్వింద్‌ కోరారు.

Updated Date - 2022-03-21T01:50:34+05:30 IST