తగ్గిన వెంకన్న హుండీ ఆదాయం

ABN , First Publish Date - 2021-04-11T09:01:37+05:30 IST

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గుతోంది. 4 నెలల తర్వాత స్వామివారికి రూ.2 కోట్లు కంటే త క్కువగా కానుకలు అందాయి.

తగ్గిన వెంకన్న హుండీ ఆదాయం

నాలుగు నెలల తర్వాత 2 కోట్ల కంటే తక్కువగా కానుకలు


తిరుమల, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గుతోంది. 4 నెలల తర్వాత స్వామివారికి రూ.2 కోట్లు కంటే త క్కువగా కానుకలు అందాయి. లాక్‌డౌన్‌ తర్వాత గతేడాది జూన్‌లో శ్రీవారి దర్శనాలను పరిమిత భక్తులతో ప్రారంభించిన విషయం తెలిసిందే. నెమ్మదిగా భక్తుల సంఖ్యను పెంచగా డిసెంబర్‌ నాటికి రోజుకు సగటున 50 వే ల మంది దర్శనం చేసుకున్నారు. గతంతో పోలిస్తే భక్తుల సంఖ్య తక్కు వైనా హుండీ ఆదాయం భారీగా లభిస్తూ వచ్చింది. గతేడాది డిసెంబరు 9న రూ.1.84 కోట్లు హుండీ ఆదాయం లభించింది. అప్పటి నుంచి ఈ నెల 8 వరకు రూ.2 కోట్లకు తగ్గకుండా రూ.5 కోట్ల వరకు  కానుకలు వచ్చాయి. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో 9న రూ.1.75 కోట్లు మాత్రమే హుండీ ఆదాయం లభించింది. 

Updated Date - 2021-04-11T09:01:37+05:30 IST