8నుంచి శ్రీవారి దర్శనాలు
ABN , First Publish Date - 2020-06-05T11:43:39+05:30 IST
8నుంచి శ్రీవారి దర్శనాలు
తిరుమల: తిరుమలలో ఈ నెల 8 నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాలను ప్రయోగాత్మకంగా పునఃప్రారంభించబోతున్నామని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులతో దర్శన విధివిధానాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆగిపోయిన శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దర్శనాల ప్రారంభానికి అంగీకారం లభించడంతో దర్శనాల అమలుపై ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. కాగా.. శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేకాలు గురువారం ప్రారంభమయ్యాయి.