రాజకీయాల కోసంమహాత్మాగాంధీని ఉపయోగించుకోవద్దు:Talasani

ABN , First Publish Date - 2022-05-20T20:37:55+05:30 IST

స్వార్ధ రాజకీయప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు మహాత్మాగాంధీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గమని పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) సికింద్రాబాద్ ఆరోపించారు.

రాజకీయాల కోసంమహాత్మాగాంధీని ఉపయోగించుకోవద్దు:Talasani

హైదరాబాద్: స్వార్ధ  రాజకీయప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు మహాత్మాగాంధీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గమని పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) సికింద్రాబాద్ ఆరోపించారు.సికింద్రాబాద్ ఎంజీరోడ్ లో గల మహాత్మా గాంధీ(mahatma gandhi) విగ్రహాన్ని తొలగిస్తున్నారనే తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవాలనే దురుద్దేశంతోనే నేడు ధర్నా చేపట్టడం దురదృష్టకరమని ఆయన అన్నారు.దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మాగాంధీ  అంటే మాకు ఎంతో గౌరవం వుందన్నారు. ఎంజీ రోడ్ లో గల గాంధీ విగ్రహం పరిసరాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేయడం  దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. 


ప్రస్తుతం ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగిస్తారని చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జస్టిస్ అమర్నాధ్ గౌడ్ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, అంజయ్య గౌడ్ లను సంప్రదించిన తర్వాతే అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.ప్రస్తుతం ఉన్నపార్క్ ప్రాంతాన్ని మరింత విస్తరించి 60 లక్షల రూపాయల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.అధికారంలో ఉన్నప్పుడు గాంధీ జయంతి, వర్ధంతిలకు మాత్రమే హాజరై గాంధీ పార్క్ అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు నేడు గాంధీ పార్క్ అభివృద్ధి జరుగుతుంటే అక్కసుతో నిరాదర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

Updated Date - 2022-05-20T20:37:55+05:30 IST