శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసుపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-03-07T23:24:20+05:30 IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసులో బీజేపీ నేత జితేందర్

శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసులో  బీజేపీ నేత జితేందర్ రెడ్డి పీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే శుక్రవారం వరకు పీఏ రాజును  ఇబ్బందులకు గురి చెయ్యొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది. పేట్ బషీరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. పేట్ బషీర్ బాగ్ పోలీసులకు ఢిల్లీలో ఉన్న రాజును పిలిచి దర్యాప్తు చేసే అధికారం ఉందా అని హైకోర్టు  ప్రశ్నించింది. శుక్రవారం వరకు పోలీసులు, అధికారులు కోర్టుకు తెలపాలని పోలీసులను హైకోర్టు అదేశించింది. అప్పటివరకు రాజుపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2022-03-07T23:24:20+05:30 IST