వాణిదేవిని గెలిపించుకోవాలి: శ్రీనివాస్గౌడ్
ABN , First Publish Date - 2021-02-27T20:12:29+05:30 IST
కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసి వాణిదేవిని గెలిపించుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
మహబూబ్నగర్: కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసి వాణిదేవిని గెలిపించుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పీవీ నరసింహారావుని గౌరవించుకోవడానికి ఆయన కూతురు వాణిదేవికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని చెప్పారు. ప్రతీ కార్యకర్తకు ఇది పరీక్షా సమయం.. కష్టపడి పనిచేసి వాణిదేవిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 2014 కన్నా ముందు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో.. పక్కా లెక్కలు ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిందని శ్రీనివాస్గౌడ్ తెలిపారు.