Srikakulamలో దంపతుల ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-02-15T14:00:20+05:30 IST
జిల్లాలోని పాలకొండ మండలం చిన్నమంగలాపురంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
శ్రీకాకుళం: జిల్లాలోని పాలకొండ మండలం చిన్నమంగలాపురంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పుల బాధ తాళలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భర్త నాగవరపు రామారావు మృతి చెందగా... భార్య తవిటమ్మ పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.