Srikakulam: బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని అదృశ్యం
ABN , First Publish Date - 2022-02-01T19:17:20+05:30 IST
జిల్లాలోని టెక్కలి పట్టణంలో మహాత్మాగాంధీ జోతి బాపూలే బీసీ బాలికల వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది.
శ్రీకాకుళం: జిల్లాలోని టెక్కలి పట్టణంలో మహాత్మాగాంధీ జోతి బాపూలే బీసీ బాలికల వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. ‘‘నేను శానిటైజర్ త్రాగాను అందరకీ బై.. గుడ్ బై’’ అంటూ తరగతి గది బోర్డుపై విద్యార్థిని రాసిన రాతలు విద్యార్థులు, ఉపాద్యాయులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థిని అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు.