శ్రీహరికోట SHARలో కొవిడ్ కలకలం

ABN , First Publish Date - 2022-06-29T16:49:01+05:30 IST

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్‌)లో కొవిడ్ కలకలం రేపుతోంది.

శ్రీహరికోట SHARలో కొవిడ్ కలకలం

నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(SHAR)లో కొవిడ్ కలకలం రేపుతోంది. షార్‌లో ఐదుగురు ఉన్నతాధికారులకు కరోనా(Corona) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు హోంఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా రేపు సాయంత్రం 6 గంటకు పీఎస్ఎల్వీ-53సీ ప్రయోగం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఉన్నతాధికారులకు కరోనా సోకడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. 


మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,506 కొత్త కేసులు నమోదు అవగా... 30 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం  4,34,33,345 కొవిడ్ కేసులు నమోదు అవగా.. మొత్తం 5,25,077మంది మృత్యువాతపడ్డారు. నిన్న కరోనా నుంచి  11,574 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,28,08,666గా ఉంది.

Updated Date - 2022-06-29T16:49:01+05:30 IST