India-Sri Lanka: రాణించిన సూర్యకుమార్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?

ABN , First Publish Date - 2021-07-26T03:15:20+05:30 IST

పరుగులు చేసి ఆతిథ్య జట్టు ఎదుట ఓ మాదిరి లక్ష్యాన్ని ఉంచింది. పృథ్వీ షా అందివచ్చిన అవకాశాన్ని చేజార్జుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే

India-Sri Lanka: రాణించిన సూర్యకుమార్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి ఆతిథ్య జట్టు ఎదుట ఓ మాదిరి లక్ష్యాన్ని ఉంచింది. పృథ్వీ షా అందివచ్చిన అవకాశాన్ని చేజార్జుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. అయితే, కెప్టెన్ శిఖర్ ధవన్ (46), సంజు శాంసన్ (27) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. సంజు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ చెలరేగాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా (10) నిరాశ పరచగా ఇషాన్ కిషన్ 14 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 20 పరుగులు (నాటౌట్) చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో చమీర, హసరంగ రెండు వికెట్లు తీసుకోగా కరుణరత్నె ఓ వికెట్ పడగొట్టాడు. 

Updated Date - 2021-07-26T03:15:20+05:30 IST