రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్: టాస్ గెలిచిన వార్నర్
ABN , First Publish Date - 2020-10-23T00:42:57+05:30 IST
ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. కాబట్టి ఐపీఎల్లో నేడు మరో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ జట్టులోకి జాసన్ హోల్డర్ వచ్చి చేరగా
దుబాయ్: ఐపీఎల్లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య 40వ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రాజస్థాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. కాబట్టి ఐపీఎల్లో నేడు మరో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ జట్టులోకి జాసన్ హోల్డర్ వచ్చి చేరగా, థంపి స్థానంలో షాబాజ్ నదీమ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. రాజస్థాన్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే గతంలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.