మాజీ ఫుట్బాలర్ సుర్జీత్ మృతి
ABN , First Publish Date - 2022-02-18T09:19:32+05:30 IST
మాజీ ఫుట్బాలర్ సుర్జీత్ మృతి
కోల్కతా: కరోనా బారినపడిన భారత మాజీ ఫుట్బాలర్, ఈస్ట్ బెంగాల్ లెజెండ్ సుర్జీత్ సేన్గుప్తా (71) గురువారం మృతి చెందాడు. 1970ల్లో సుర్జీత్ తన డ్రిబ్లింగ్ నైపుణ్యంతో ఫుట్బాల్ ఫ్యాన్స్ను అలరించాడు. 1974, 78 ఆసియా క్రీడల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు.