ఇక.. రంజీల్లోనూ డీఆర్ఎస్
ABN , First Publish Date - 2020-02-19T10:45:16+05:30 IST
రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ నుంచి పరిమిత స్థాయిలో అంపైర్ నిర్ణయ సమీక్ష (డీఆర్ఎస్) విధానాన్ని అమలు చేయాలన్న ఆలోచన తమకు ఎప్పటినుంచో ఉం
న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ నుంచి పరిమిత స్థాయిలో అంపైర్ నిర్ణయ సమీక్ష (డీఆర్ఎస్) విధానాన్ని అమలు చేయాలన్న ఆలోచన తమకు ఎప్పటినుంచో ఉందని బీసీసీఐ క్రికెట్ వ్యవహారాల జీఎం సబా కరీం చెప్పాడు. గత సీజన్ నాకౌట్ మ్యాచ్ల్లో అంపైరింగ్ తప్పిదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో డీఆర్ఎ్సను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని తెలిపాడు. అయితే సెమీస్ దశ నుంచి మాత్రమే దానిని వినియోగించనున్నామన్నాడు.