అమెరికాలో హిందూ ఆధ్మాతిక గురువు కన్నుమూత

ABN , First Publish Date - 2020-09-27T12:01:03+05:30 IST

అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూశారు.

అమెరికాలో హిందూ ఆధ్మాతిక గురువు కన్నుమూత

వాషింగ్టన్‌, సెప్టెంబరు 26: అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు.   పెన్సిల్వేనియాలో అర్ష విద్యా గురుకులానికి ఆయన ఉపాధ్యక్షులుగా ఉన్నారు.  గురుకులం 34వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈనెల 20తేదీన తుదిశ్వాస విడిచినట్టు ఆయన శిష్యులు తెలిపారు. ప్రత్యాగ్‌బోధానంద పార్థివదేహాన్ని భారత్‌కు తరలిస్తున్నామన్నారు.

Updated Date - 2020-09-27T12:01:03+05:30 IST