డుప్లెసిని అలా చూసి బాధేసింది
ABN , First Publish Date - 2020-10-23T09:45:00+05:30 IST
చెన్నై జట్టులోని గట్టిపోటీ కారణంగానే తనకు మ్యాచ్లు ఆడే అవకాశం రావడం లేదనిదక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ తెలిపాడు
దుబాయ్: చెన్నై జట్టులోని గట్టిపోటీ కారణంగానే తనకు మ్యాచ్లు ఆడే అవకాశం రావడం లేదనిదక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ తెలిపాడు. గతేడాది డుప్లెసిలాంటి ఆటగాడే డ్రింక్స్ మోశాడని గుర్తుచేశాడు. అయినా సీఎ్సకే ఆటగాడిగా ఇంటా, బయటా దక్కే గౌరవం గొప్పగా ఉంటుందని కొనియాడాడు. ‘ప్రపంచవ్యాప్తంగా నేను ఎన్నో లీగ్లు ఆడా. కానీ సీఎస్కే నుంచి దక్కిన గౌరవం ప్రత్యేకమైనది. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకే స్థానం ఇవ్వాలి కాబట్టి పోటీ ఎక్కువగా ఉంది. గత సీజన్లో డుప్లెసి అదనపు ఆటగాడిగా డ్రింక్స్ మోయడం చూసి బాధేసింది. ఎందుకంటే టీ20ల్లో అతడికి అద్భుత సగటుంది. ఈసారి డుప్లెసి పాత్ర నేను పోషిస్తున్నా’ అని తాహిర్ తెలిపాడు. గాయంతో బ్రావో లీగ్కు దూర మవడంతో తదుపరి మ్యాచ్ల్లో తాహిర్కు చోటు దక్కవచ్చు.