టీటీడీలో సిఫార్సు లేఖలకు ప్రత్యేక సెల్
ABN , First Publish Date - 2021-03-04T01:12:32+05:30 IST
ప్రజాప్రతినిధులు తమ అనుచరుల కోసం సిఫార్సు చేసే లేఖలపై
తిరుమల: ప్రజాప్రతినిధులు తమ అనుచరుల కోసం సిఫార్సు చేసే లేఖలపై శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు ఇచ్చే టికెట్ల జారీకి ప్రత్యేక సెల్ ఉందని టీటీడీ తెలిపింది. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిపై ఎంపీ రఘురామ చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఖండించింది. శ్రీవారి దర్శనం టికెట్ల జారీకి టీటీడీ చైర్మన్కు సంబంధం లేదని టీటీడీ పేర్కొంది. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం కోసం వచ్చే వారికి ఇచ్చే టికెట్ల జారీకి ప్రత్యేక సెల్ ఉందని తెలిపింది. రఘురామకృష్ణరాజు సిఫారసు చేసిన లేఖలను ఇప్పటి వరకు ఒక్కటి కూడా తిరస్కరించలేదని టీటీడీ పేర్కొంది.