పోలవరంపై చంద్రబాబు, లోకేష్ విమర్శలు సరికాదు: స్పీకర్
ABN , First Publish Date - 2020-10-31T23:40:35+05:30 IST
పనిచేసే వాళ్లపై రాళ్లు వేయటం ఈజీ అని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో చంద్రబాబు, లోకేష్ విమర్శలు సరికాదన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు పోలవరం విషయంలో ఏం చేశారు? అప్పట్లో దొడ్డిదారిన మంత్రి అయి
శ్రీకాకుళం: పనిచేసే వాళ్లపై రాళ్లు వేయటం ఈజీ అని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో చంద్రబాబు, లోకేష్ విమర్శలు సరికాదన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు పోలవరం విషయంలో ఏం చేశారు? అప్పట్లో దొడ్డిదారిన మంత్రి అయి లోకేష్ పదవిలో ఉన్నారు కదా? బీసీ కార్పొరేషన్ పదవులు నాలుక గీచుకోవటానికి పనికిరావటంటున్నారు.. ఈ అంశంపై టీడీపీ తీర్మానం చేయగలదా? అని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు.