పార్ల్ వన్డే: కీలక వికెట్లు కోల్పోయిన భారత్

ABN , First Publish Date - 2022-01-20T00:59:35+05:30 IST

పార్ల్: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి వన్డేలో 297 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 38 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

పార్ల్ వన్డే: కీలక వికెట్లు కోల్పోయిన భారత్

పార్ల్: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి వన్డేలో 297 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 41 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 12, శిఖర్ ధావన్ 79, కోహ్లీ 51, రిషబ్ పంత్ 16, శ్రేయస్ అయ్యర్ 17, వెంకటేశ్వర్ అయ్యర్ 2, రవిచంద్రన్ అశ్విన్ 7 పరుగులకు అవుటయ్యారు. శార్దూల్ ఠాగూర్, భువనేశ్వర్ కుమార్ క్రీజులో ఉన్నారు.


అంతకుముందు సఫారీలు 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డస్సెన్ 129, టెంబా బవుమా 110 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 48 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ 53 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 



Updated Date - 2022-01-20T00:59:35+05:30 IST