శిఖర్ ధవన్ ట్విట్‌పై స్పందించిన సోనూ సూద్

ABN , First Publish Date - 2020-05-26T20:38:10+05:30 IST

కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలకు సోనూసూద్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. కరోనా కకాలవికలంతో అస్తవ్యస్తమైన వలస

శిఖర్ ధవన్ ట్విట్‌పై స్పందించిన సోనూ సూద్

ముంబై: కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలకు సోనూసూద్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. కరోనా కకాలవికలంతో అస్తవ్యస్తమైన వలస జీవులను సొంతూర్లకు తరలించేందుకు ఈ బాలీవుడ్ యాక్టర్ సొంత ఖర్చుతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకోని వేలాది మంది వలస కూలీలను వారి సొంతూళ్లకు పంపించారు.


సోనూ చేస్తున్న ఈ పనిపై టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘సోనూ సూద్.. కష్టాల్లో ఉన్న వలసకూలీలను వాళ్ల సొంత ఊళ్లకు తరిలించడానికి నువ్వు చేసిన వీరోచిత ప్రయత్నానికి నా బిగ్ సెల్యూట్’’ అని ట్వీట్ చేశాడు. దీనిపై సోనూసూద్ స్పందించాడు. ‘‘చాలా థాంక్స్ సోదరా. శిఖర్ ధవన్ క్రీజ్‌లో ఉంటే మనం భద్రంగా ఉన్నామనే విషయం ఇండియాకి తెలుసు. అలాగే నేను ప్రతి వలస కూలీలు సురక్షితంగా ఇంటికి చేరే వరకూ క్రీజ్‌లోనే ఉంటాను అని మాటిస్తున్నాను’’ అని సోనూ పేర్కొన్నాడు. 

Updated Date - 2020-05-26T20:38:10+05:30 IST