తండ్రిని చంపడానికి కిల్లర్ను పెట్టిన కొడుకు!
ABN , First Publish Date - 2020-08-10T04:07:04+05:30 IST
కన్న తండ్రిని హత్య చేయించడానికి పథకం వేశాడో కొడుకు.
బెంగళూరు: కన్న తండ్రిని హత్య చేయించడానికి పథకం వేశాడో కొడుకు. దీనికోసం ప్రత్యేకంగా ఓ కిల్లర్ను పెట్టాడు. తండ్రిని కిడ్నాప్ చేసి విషం ఇచ్చి చంపాలని అతనికి సూచించాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. స్థానికంగా నివశించే ఓ బిల్డర్ను అతని కుమారుడే అంతమొందించాలనుకున్నాడు. పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్న తండ్రి ఆమెకు డబ్బు, ఆస్తులు ఇవ్వడాన్ని అతను సహించలేకపోయాడు. తాను డబ్బు అడిగితే ఇవ్వకుండా, అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు ఇవ్వడంతో ఆగ్రహోదగ్ధుడైపోయాడు. ఆ కోపంలోనే ఓ కిల్లర్ను సంప్రదించాడు. తన తండ్రిని కిడ్నాప్ చేసి విషమిచ్చి చంపాలని చెప్పాడు. దీనికోసం రూ.10లక్షలు ఇస్తానని చెప్పాడు. ముందుగా రూ.3లక్షలు ఇచ్చి, మిగతా సొమ్ము పని పూర్తయ్యాక ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ప్రస్తుతం సదరు బిల్డర్ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.