ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు..: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2020-09-22T18:04:37+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఒక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు..: సోము వీర్రాజు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఒక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం రాష్ట్ర పదాదికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు..అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. సమృద్‌ ఆంధ్రా పేరుతో ముందుకు సాగుతామన్నారు. ఏపీలో రాజకీయాలు కుటుంబాల చుట్టూనే తిరుగుతాయన్నారు. రాష్ట్రాన్ని సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో..దేశంలోనే ఆదర్శంగా తయారు చేస్తామని సోము వీర్రాజు అన్నారు.

Updated Date - 2020-09-22T18:04:37+05:30 IST