AP News: బీజేపీ ఆలోచన అభివృద్ధి మాత్రమే: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-07-29T21:31:29+05:30 IST

బీజేపీ (BJP) ఆలోచన అభివృద్ధి మాత్రమేనని బీజేపీ నేత సోమువీర్రాజు (Somuveerraju) ప్రకటించారు.

AP News: బీజేపీ ఆలోచన అభివృద్ధి మాత్రమే: సోమువీర్రాజు

అమరావతి: బీజేపీ (BJP) ఆలోచన అభివృద్ధి మాత్రమేనని బీజేపీ నేత సోమువీర్రాజు (Somuveerraju) ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), మాజీప్రధాని వాజ్‌పేయితో ఉన్నట్లుగా.. ప్రధాని మోదీతో కలిసి ఉంటే రాజధాని పూర్తయ్యేదని తెలిపారు. మోదీతో చంద్రబాబు ఉంటే వైసీపీకి 150 సీట్లు వచ్చేవి కాదని పేర్కొన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే రెండేళ్లలో రాజధాని నిర్మిస్తామని ప్రకటించారు. సీఎం జగన్ (CM Jagan), చంద్రబాబు తీరుతో రాజధాని రైతులు నష్టపోయారని సోమువీర్రాజు దుయ్యబట్టారు. అంతకుముందు రాజధాని గ్రామాల్లో సోమువీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాజధాని గ్రామాల్లో సోమువీర్రాజు పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏడాదిలో రాజధాని నిర్మిస్తామని వీర్రాజు చెప్పారు. దీనిపై పెనుమాకకు చెందిన రైతు కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌, మీరు తోడుదొంగలై రాజధానిని నాశనం చేశారని రైతు శాపనార్థాలు పెట్టారు. సోమువీర్రాజుతో కోటేశ్వరరావు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ‘‘రాజధానిని కట్టని ఆయనను వదిలి మామీద పడితే ఎలా’’ అని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో సోమువీర్రాజు ఖంగుతిన్నారు.

Updated Date - 2022-07-29T21:31:29+05:30 IST