ప్రవాసాంధ్రులతో సోమువీర్రాజు ఫోన్ కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2022-08-08T22:31:52+05:30 IST

ప్రవాసాంధ్రులతో సోమువీర్రాజు ఫోన్ కాన్ఫరెన్స్

ప్రవాసాంధ్రులతో సోమువీర్రాజు ఫోన్ కాన్ఫరెన్స్

అమరావతి: ప్రవాసాంధ్రులతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆజాదీగా అమృత మహోత్సవ్‌లో భాగంగా అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెలకు ఒకసారి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రవాసాంధ్రులు సోము వీర్రాజును కోరారు. అమెరికాలో పర్యటించాలని ప్రవాసాంధ్రులు సోము వీర్రాజును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్ధితిలు ప్రవాసాంధ్రులకు వివరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వల్ల ప్రజలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, కేంద్ర నిధులతో  ఏపీలో ఎంతో అభివృద్ది జరుగుతుందన్నారు. దేవాలయాలు పరిరక్షణ కోసం బీజేపీ వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు నిండిందని, ప్రధాన మంత్రి  నరేంద్రమోదీ అజాదీకా అమృత మహోత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రవాసాంధ్రులుకూడా ఈకార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సూచించారు. 

Updated Date - 2022-08-08T22:31:52+05:30 IST