తిరుపతి ఎన్నికలు మాకు ప్రెస్టీజియస్ ఎన్నికలు

ABN , First Publish Date - 2021-03-20T22:35:13+05:30 IST

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తమ పార్టీకి ప్రెస్టీజియస్ ఎన్నికగా

తిరుపతి ఎన్నికలు మాకు ప్రెస్టీజియస్ ఎన్నికలు

నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తమ పార్టీకి  ప్రెస్టీజియస్ ఎన్నికగా మారిందిన మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో పోటీ చేసే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ పరిచయ కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థలలో ప్రజలను మభ్య పెట్టినట్టుగా ఈ ఎన్నికలల్లో ప్రజలను వలంటీర్లతో మభ్యపెట్టె అవకాశం లేదని ఆయన అన్నారు.


ఈ ఉప ఎన్నికలు సైకిల్, ఫ్యాన్‌కి మధ్య జరిగే ఎన్నికలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న కమిషన్ల దోపిడీని అందరూ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 


తాను 16 నెలలు జైల్లో ఉండి జగన్ వచ్చాడు కాబట్టి అలాగే చంద్రబాబుని 16 రోజులైన జైల్లో పెట్టాలనే ఆలోచనలా జగన్‌కు ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తయారు చేస్తున్న చెత్త మందు తాగి పేద ప్రజలు పక్షవాతం వచ్చి ఆసుపత్రి పాలవుతున్నారని ఆయన విమర్శించారు. 

Updated Date - 2021-03-20T22:35:13+05:30 IST